Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

Archive for the ‘Andhra Jyothy’ Category

హక్కుల తాత్వికత-సాహిత్య వాస్తవికత – - వివిన మూర్తి

without comments

 

హక్కుల తాత్వికత-సాహిత్య వాస్తవికత - వివిన మూర్తి

(AndhraJyothy, October 8th 2012)

బాలగోపాల్ గొప్ప చైతన్యంతో చేసిన వివరణలూ ప్రయత్నించిన సవరణలూ అదే కోవకి చెందిన సాహిత్యకారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, చర్చించాలనీ నా ఆశ. అప్పుడు సృజన, విమర్శ అంగాల ద్వారా బలం సంతరించుకుని సమాజ గమనంలో క్రియాశీల పాత్ర వహించగలదు సాహిత్యం. ఇప్పటితో పోలిస్తే మార్క్సునాటికి సమాచార సేకరణ, విస్తరణ ఎంతో కష్టసాధ్యం. అయినా ఆయన కృషి ‘ప్రపంచ మానవాళి’ అన్న తాత్విక దృష్టిని ప్రవేశపెట్టగలిగింది. ఈ దృష్టితో ప్రభావితమైన సాహిత్యం మానవుడిని కేంద్రంగా చేసుకుంది. తెలుగు సాహిత్యంలో కూడా ఈ తాత్విక దృష్టిని చాలావరకూ ప్రధానం చేసుకుంది. ఈ పరిధిలోనే వెలువడిన సాహిత్యం అనేక సమూహాలతో నిండిన మన సమాజంలోని అన్ని సమూహాలనూ స్పృశించలేకపోయింది. మన సాహిత్యంలో వివిధ సమూహాల స్వయం వ్యక్తీకరణ ఆరంభమైంది…

బాలగోపాల్ జీవించినకాలంలో జీవించినందుకు, ఆయనతో నేరుగా మాటలాడగలిగినందుకు, ఆయనని చదవగలిగినందుకు గర్వపడేవారిలో నేనొకడిని. చిత్తశుద్ధీ, మేధావిత్వం, ఆచరణ గలవారిలో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఆయన జీవితంలో అధిక భాగాన్ని హక్కుల ఉద్యమం లో వినియోగించారు. ఈ సందర్భంగా ఆయన పరిశీలనలను, అభిప్రాయాలను అనేక సందర్భాలలో వివరించారు. వాటిని మానవహక్కుల వేదిక ‘హక్కుల ఉద్యమం తాత్విక దృక్పథం’ అన్న పుస్తకంగా ప్రచురించింది. ఈ పుస్తకం చదువుతుంటే హక్కుల ఉద్యమానికి సామాజిక గమనంలో గల ప్రత్యేక స్థానాన్నీ, ప్రత్యేక తాత్వికతనూ గురించి వారి మనసులో గల రూపం మన కంటికి కడుతుంది.

మనసుకి పడుతుంది. దీనిలో బాలగోపాల్ కార్యకర్తగానే కాకుండా తాత్వికునిగా కనిపిస్తారు. వాటిలో అనేక చర్చనీయాంశాలు ఉన్నాయి. కొన్నింటిని నేను మరోకోణంలో చూడవచ్చు. కొన్నింటితో నాకు పూర్తి ఏకీభావం కుదరకపోవచ్చు. ఈ వ్యాసం వాటినన్నింటినీ పరిశీలించటానికి, బేరీజు వేయటానికీ ఉద్దేశించినది కాదు. నేను కేవలం సాహిత్యపు ఆలోచనల వాడిని, వారి సాధికారత, వారి ఆచరణ, అనుభవాల ఫలితం. పోతే- ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ నేను కృషి చేస్తున్న సాహిత్యానికి సంబంధించిన అనేక ఆలోచనలు కలిగాయి. వాటిని పంచుకోటమూ, చర్చకు పెట్టటమూ ఈ వ్యాసం ఉద్దేశ్యం.

సాహిత్యానికీ హక్కుల ఉద్యమానికీ సంబంధం నా మొదటి ఆలోచన. ఇది వివరించే ముందు బాలగోపాల్ హక్కుల ఉద్యమం గురించి చెప్పిన ప్రధాన అంశాలు అదే వరసలో చెప్పుకుందాం.

1. ఈనాడు మనకు కొన్ని హక్కులు చట్టరూపంలో ఉన్నాయి. ఇవి మనకు లభించటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధిపత్యరూపాలపై పోరాటాలు జరిగాయి. ఇందులో ఏవీ అయాచితంగా లభించలేదు. అంటే నాగరికత, ప్రజాతంత్ర భావనలు మానవుడి పోరాట ఫలితాలు. ఇది మనం నమ్మాలి. బాలగోపాల్ మాటల్లో ‘ప్రజాస్వా మ్యం అనేది కొన్ని హక్కులు, విలువలు, సంస్థలు, ప్రక్రియల కలయిక. ఇవి చరిత్రలో అనేక పోరాటాల ఫలితంగా వచ్చినవి.’ ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాటకంగా, బూటకంగా, భ్రమగా, బూర్జువా వర్గాల కుట్రగా భావించరాదు. దాని విలువను, బూర్జువా పాలకులు దానిని ఉపయోగించుకునే విధానాన్నీ విడివిడిగా చూడా లి.

2. హక్కుల ఉద్యమం చట్టాల ద్వారా లభించిన హక్కుల అమలుకి ప్రయత్నిస్తుంది. లేని హక్కుల అవసరాన్ని గుర్తిస్తుంది. వాటి సాధనకి పోరాడుతుంది.

3. హక్కుల ఉద్యమ కార్యకర్తలు ఆలోచనాపరులు. అల్పసంఖ్యాకులైన వీరు అధిక సంఖ్యాకులను చైతన్యపరచి వారితో కలసి ఉద్యమిస్తారు.

4. రాజకీయ ఉద్యమాల అవసరాలకోసమే హక్కుల ఉద్యమాలు చారిత్రకంగా పుట్టాయి. అవి ఆ అవసరాలకు పరిమితమై పోకుండా తమ అనుభవాలతో అవగాహన పెంచుకుని, విలువలని నిర్వచించుకుంటూ సాగినపుడే మరిం త వ్యాప్తి చెందాయి.

5. హక్కుల ఉద్యమాలు స్వతంత్రంగా నడవాలి. రాజకీయ ఉద్యమ లక్ష్యాలతో, విధానాలతో విభేదించవలసిన సందర్భాలలో అవి తీసుకునే వైఖరి, వ్యవహరించే ధోరణి ప్రజాతంత్ర భావనకి నిర్ణయాత్మకమైనవి.

6. కమ్యూనిస్టు రాజకీయ ఉద్యమాలు వ్యవస్థలో మార్పుని ప్రధానంగా చేసుకుంటాయి. అయితే అనేక వ్యవస్థలు ఉన్నాయని, అవన్నీ మార్పు కావలసి ఉన్నాయనీ, వాటన్నింటి మార్పుకీ ఉమ్మడి ఉద్యమం (లేదా ఉమ్మడి మార్పు) అజెండాకి ప్రత్యామ్నాయంగా పలు వ్యవస్థల మార్పు అన్నది అజెండా కావాలని బాలగోపాల్ అభిప్రాయపడతారు. ఈ పలు వ్యవస్థలలో ఒకటిగానే కార్మిక పెట్టుబడిదారీ వ్యవస్థని చూడాలని వారు సూచిస్తారు. స్త్రీ పురుషుల మధ్య, అగ్రవర్ణాలు దళితుల మధ్య ఘర్షణలో స్త్రీలూ, దళితులూ కోరుకునే హక్కులకీ, కార్మికులు కోరుకునే హక్కులకీ మధ్య తాత్వికమైన తేడాపట్ల తన వాదనను బలంగా వినిపిస్తారు.

7. నాగరికత, ప్రజాతంత్ర వ్యవస్థల చరిత్రగతిని హక్కుల ఉద్య మ అవగాహనలో భాగం చేసుకుని హక్కుల పరిభాష నిర్మించుకోవాలి. అది విప్లవ పరిభాష కన్న భిన్నంగా, స్వతంత్రంగా, తాత్వికమైన లోతుతో ఉండాలి. ఈ వ్యాసానికి సంబంధించిన మేరకు బాలగోపాల్ హక్కుల తాత్వికతలో ఇవి ప్రధాన అంశాలు.
సాహిత్యానికీ హక్కులఉద్యమానికీ సంబంధం ఏమిటో ఆలోచిద్దాం.

1. పైవాటిలో మూడవది ఈ రెంటిలో పాల్గొనేవారి పోలికను చర్చించటానికి ఉద్దేశించినది. హక్కుల కార్యకర్తలు ఈనాడు చైతన్యం గల వ్యక్తులు. తోటి మనుషుల కష్టాలను పట్టించుకునే వ్యక్తులు. ఓనాడు అవసరాలు తొయ్యటంతో రాజకీయ పోరాటాలు (పరిమిత అర్థంలో) జరిగి హక్కులు ఉమ్మడిగా సంపాదించుకోటం జరిగి ఉండవచ్చు. ఈనాడు వీరు సంఘంగా ఏర్పడితే మాత్రమే ఉద్యమించగలరు. ఒక తాత్విక అవగాహన నుంచి చూస్తే ప్రజావసరాల నుంచే ప్రజల ఆకాంక్షల ఫలితంగానే ఇప్పటి ఉద్యమాలు పుట్టాయని వ్యాఖ్యానించవచ్చు. కాని వాస్తవంగా ఈ కార్యకర్తలు చైతన్యం గల వ్యక్తులు. ఆ ఉద్యమాలలో ఆచరణ, అనుభవాలు ఉమ్మడి అవగాహనకి దారితీస్తాయన్నదీ వాస్తవమే.

సాహిత్య సృజన, విమర్శలలో పాల్గొనేవారు ప్రధానంగా వ్యక్తు లు. సామాజిక కారణాల ప్రేరణతో పాల్గొనే వారినే ఈ వ్యాసంలో పరిశీలించినా, వీరి సృజనకి ప్రేరణ స్వీయ వ్యక్తీకరణే. అది సమూ హ వ్యక్తీకరణగా అర్ధం చెప్పుకోటం ఉన్నప్పటికీ ఈనాడిది వ్యక్తి కృషి. వీరు సంఘంగా ఏర్పడవలసిన అవసరం సాహిత్య సృజనకి తప్పనిసరి కాదు. అలా ఏర్పడటం ద్వారా సృజనకి ఒక ఉమ్మడి లక్ష్యం నిర్దేశించుకోటం జరగవచ్చు. అది రాజకీయ లక్ష్యం కావటం హెచ్చు. ఈ వ్యక్తిగత సృజనలో సమాజం ఉంటుంది. సమూహాలు ఉంటాయి. మనుషులు పడే రకరకాల కష్టాలు ఉంటాయి. వాటి ఉమ్మడి స్వభా వం, వాటికి ఉమ్మడి పరిష్కారం ఉండవచ్చు. అయినా వీరు వ్యక్తులే. చైతన్య స్థాయిలో, ఆచరణలో వీరికీ వారికీ నడుమ తేడా ఉంటుంది. సాహిత్యకారులని వ్యక్తులుగా చూడటంలోని వెసులుబాటు హక్కుల కార్యకర్తలని చూడటానికి లేదు.

2. నాలుగవ అంశం పుట్టుకకి సంబంధించినది. సాహిత్యం పుట్టు క మానవ సమాజ పరిణామంలో తొలిదశకి చెందినది. హక్కుల ఉద్యమాలు (ఇప్పటి అర్ధంలో) ఇటీవలి కాలానికి చెందినవి. రెండూ సామాజిక పరిణామంలో భాగాలే. రెండూ అసహాయ మానవుడి పక్షానే మాటాడుతాయి (దాదాపు). రెండూ ఆయాకాలాల, సమాజాల సామాన్యుల అవసరాల నుంచే పుట్టాయి. అలాగే వర్గసమాజ దృష్టితో చూస్తే పాలక వర్గాల ఆనందాలకూ, అవసరాలకూ ఎంతోకొంత అనుగుణంగా సాహిత్యం మారటం మధ్యయుగాల వరకూ సాగింది. ఇప్పటి పాలకుల అవసరాల కోసమే (స్వేచ్ఛావిపణి కోసం) ఒకప్పుడు జరిగిన పోరాటాలే తొలి హక్కుల ఉద్యమాలు. తర్వాతనే సాహిత్యం వివిధ సమాజాలలో లేనివాళ్లూ- ఉన్నవాళ్లూ (బాలగోపాల్ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో జ్ఞానాధికారం ఉన్నవాళ్లూ- లేనివాళ్లు, ప్రాశ్చాత్య దేశాలలో పౌర హక్కులు ఉన్నవాళ్లూ-లేనివాళ్లు) మధ్య ఘర్షణను పట్టించుకుంది.

3. నాలుగవ అంశంలోనే మరొక భాగం హక్కుల ఉద్యమాల వ్యాప్తి. ఎదుగుదలకి సంబంధించినది. కార్యకర్తల ఉద్యమ అనుభవాలు దాని అవగాహనని పెంచుతాయని బాలగోపాల్ చెపుతారు. అంటే ఉద్యమ కార్యాచరణలో కొత్త ప్రశ్నలు ఎదురవుతాయి. వాటిని లెక్కలోకి తీసుకుంటూ హక్కుల ఉద్యమ లక్ష్యాలను సవరించుకుం టూ ముందుకు సాగాలి. ఇది ఉద్యమాలన్నింటి పట్లా ఉండే సాధారణ అవగాహన. ఆచరణకి సిద్ధాంతం కన్న తొలి స్థానం ఇవ్వటం. అది అన్ని వేళలా ఎదుగుదల అవుతుందా- అప్పటికి నిర్ణాయక స్థానంలో ఉన్నవారి సమన్వయ శక్తి, అవగాహనా సామర్థ్యం పాత్ర ఏమిటి? చారిత్రకంగా ఫలితాలను బట్టే తరవాతి తరాల వారు ఉత్థా న పతనాలుగా విభజిస్తారు గదా?

ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నా యి.  అయినా మానవునికి అది తప్ప మార్గంలేదు.  ఇంక సాహిత్యా న్ని గురించి ఆలోచిస్తే దాని ఎదుగుదలని హక్కుల ఉద్యమం ఎదుగుదలతో సరితూచటం సాధ్యం కాదు. మానవ సమాజ ఉమ్మడి అవగాహనని సాహిత్యంలోంచి చూడవచ్చుగాని సాహిత్యకారులు ఉమ్మడిగా చేయగలిగింది చాలా స్వల్పం.

4. మార్క్సిస్టు తాత్విక, రాజకీయ, ఆర్థిక చింతనలకి సంబంధించిన అంశం ఆరవది. ఇది వర్తమా న హక్కుల ఉద్యమాల జీవన్మరణ సమస్య. సాహిత్యానికి సంబంధించి ఇది ఆధునిక సాహిత్యాన్ని గట్టి గా ప్రభావితం చేసిన అంశం మాత్రమే. సాహిత్యం ఎవరు అంగీకరించినా మానినా అన్ని రకాల వాదనలనూ, దుఃఖాలనూ, ఆవేశాలనూ పంచుకునే ఉమ్మడి వేదిక. సమాజంలోని అనేకానేక ఘటనలకు వ్యక్తుల ప్రతిస్పందన. పోతే బాలగోపాల్ ఈ అంశం గురించి చాలా చర్చించారు. ఆయన మరిం త కాలం ఉంటే, ఉన్నపుడు మరింత సమయం వెచ్చించి ఉంటే మార్క్సిస్టు రాజకీయ చింతనకు ఒక సమగ్ర తాత్వికతని, అవగాహనని సమకూర్చగలిగేవారని నాకు అనిపిస్తుంది. ఈ విషయం గురిం చి ఆయన పదేపదే మాటలాడవలసిరావటం హక్కుల ఉద్యమానికి ఈ అంశానికి గల విడదీయరాని సంబంధాన్ని తెలియబరుస్తుంది.

బాలగోపాల్ హక్కుల తాత్వికత నుంచి సాహిత్యకారులు నేర్చుకోవలసింది ఏమిటి?

1.తత్వశాస్త్రం చేయవలసిన పని ప్రపంచ వివరణ మాత్రమే కాదు, సవరణ కూడా అంటారు మార్క్సు. ఈ వ్యాఖ్య ప్రపంచ గమనంలో ఒక విభజన బిందువుగా చాలామంది భావిస్తారు. ఆయనకి ముందు తత్వశాస్త్రాలు సవరణకి ప్రయత్నించలేదా ఆ తర్వాత వివరణతో ఆగిపోలేదా అని ప్రశ్నించుకోవచ్చు. కాని మార్క్సుకి ముందు సవరణ దృష్టాంతాలు అప్రయత్నంగా జరిగాయాయని, ఆ తర్వాత వివరణతో ఆగిపోవటాలు ప్రయత్న పూర్వకంగా జరిగాయని మనం గమనించవచ్చు. బాలగోపాల్ గొప్ప చైతన్యంతో చేసిన వివరణలూ ప్రయత్నించిన సవరణలూ అదే కోవకి చెందిన సాహిత్యకారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, చర్చించాలనీ నా ఆశ. అప్పుడు సృజన, విమర్శ అంగాల ద్వారా బలం సంతరించుకుని సమాజ గమనంలో క్రియాశీల పాత్ర వహించగలదు సాహిత్యం.

ఇప్పటితో పోలిస్తే మార్క్సునాటికి సమాచార సేకరణ, విస్తరణ ఎంతో కష్టసాధ్యం. అయినా ఆయన కృషి ‘ప్రపంచ మానవాళి’ అన్న తాత్విక దృష్టిని ప్రవేశపెట్టగలిగింది. ఈ దృష్టితో ప్రభావితమైన సాహిత్యం మానవుడిని కేంద్రంగా చేసుకుంది. తెలుగు సాహిత్యంలో కూడా ఈ తాత్విక దృష్టిని చాలావరకూ ప్రధానం చేసుకుంది. ఈ పరిధిలోనే వెలువడిన సాహిత్యం అనేక సమూహాలతో నిండిన మన సమాజంలోని అన్ని సమూహాలనూ స్పృశించలేకపోయింది. మన సాహిత్యంలో వివిధ సమూహాల స్వయం వ్యక్తీకరణ ఆరంభమైంది. దానితో భారత దేశపు ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం అవసరం సమాజ హితైషులు గుర్తించారు. ఆ దిశలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసిన బాలగోపాల్ మన సాహిత్య రంగంలోని అనేక ప్రశ్నలకు జవాబు వెతకటంలో ఉపయోగపడతారు.

2. హక్కుల పోరాట చరిత్రకి సంబంధించిన మొదటి అంశం జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం. మనమున్న ప్రస్తుత స్థితి దానికదే ప్రత్యేకంగా కాంక్షించదగ్గ స్థితి అని మనకు బాలగోపాల్ చెపుతారు. ఇది సాహిత్యానికి సంబంధించి కూడా ప్రధానమైనది. హక్కు ల విషయమే తీసుకుంటే మానవజాతిలో భాగంగా మనం కూడా పోరాటాలలో భాగమని చెప్పుకోవచ్చు. కాని ఓ దేశంగా గాని, జాతి గా గాని తీసుకున్నట్లయితే మనకీనాడు ఉన్న హక్కులలో అధికభాగం వలస పాలకులు వారి పాలిత దేశాలలో పాలితులకి అనువర్తింపజేయటం వల్ల లభించాయి. అంతేకాక వలస పాలనకు ముం దున్న వ్యవస్థలోని అనేక అవాంఛిత అంశాలు మన దేశస్తుల హక్కులలో భాగాలే. సతి, బాల్యవివాహాలు, విధవా వివాహాలు, అస్పృశ్యత వంటివి ఆచరించటానికి గల అధికారం ‘హక్కు’గానే చెలామణీ అయ్యేది. వీటిని నేరంగా మార్చిన చట్టాలు వలస పాలనలోనే పుట్టి ఆ హక్కులను తొలగింపజేసాయి.

ఈ విధంగా పరిశీలిస్తే పోగొట్టుకోవలసిన కొన్ని హక్కులను పౌరులు పోగొట్టుకోటానికి, వ్యక్తులుగా సమూహాలుగా కొన్ని హక్కులను పొందటానికీ ప్రత్యక్ష కారణం వలస పాలనే. అలాగే ఆధునిక సాహిత్యం అని మనం గుర్తిస్తున్నది ఇక్కడి సాహిత్య పరిణామక్రమంలో రూపొందినది కాదు. దీనిని మానవ జాతి పరిణామంలో భాగమని అనవచ్చు. ఆధునిక పూర్వ సాహిత్యంలో మన శిష్ట సాహిత్య లక్ష్యాలు నీతిబోధ, భగవద్భక్తి ప్రేరణ, సంపన్నుల, విద్వాంసుల మనోల్లాసం, స్వీయానందం, స్వీయ ముక్తి వంటివి. జానపదుల సాహిత్యం వేరని దాని లక్ష్యాలు వేరని అవి శిష్టసాహిత్యం కన్న ప్రజాహితంలోనూ, వినియోగంలోనూ ముందున్నాయనీ నేడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ రెండు సాహిత్యాలలోనూ సామాజిక సంస్కరణ, స్వీయ వ్యక్తీకరణ, భావాల కలబోత, పాఠకుని చైతన్యం పెంచటం వంటివి నేటి లక్ష్యా లు. ఈ మార్పుకి సైతం వలసపాలన ప్రభావం ఉంది. ఈ మార్పు వాంఛనీయమైనదే. దానాదీనా బాలగోపాల్ చెపుతున్నట్లు వర్తమాన స్థితిపట్ల సాహిత్యకారునికి చిన్నచూపు తగదు.

3. ఉన్న హక్కులు కాపాడుకోటం ఎంత అవసరమో అంతే అవసరమైనది కావలసిన హక్కులు గుర్తించి సాధించటం రెండవ అంశం. ఇది సాహిత్యకారులకి మరో ప్రధానాంశం. గతంలోని సామాజిక దౌష్ట్యాన్ని అనేక కోణాలనుంచి విశ్లేషించటం ఎంటువంటి సాహిత్య కర్తవ్యమో, వర్తమాన స్థితిని లోతుగా పరిశీలించటం అంతే అవస రం. మన దేశానికి పట్టిన దీర్ఘకాలిక వ్యాధి బ్రాహ్మణీయ భావజా లం. ఇది ఒకరకంగా ఒక ఆధిపత్యకులం ప్రవేశపెట్టినదన్న ఆలోచన సులువుగా కలుగుతుంది. ఎవరైనా అలా వివరిస్తే సులువుగా నమ్మగలుగుతాం. ఉమ్మడి సంప్రదాయాలతో రూపొందిన సమూహాలను ఉమ్మడి నామంతో గుర్తుపట్టటం మానవజాతి ఉమ్మడి లక్షణం. వాటి ని తెగలు, జాతులు, కులాలు అనటం చరిత్రలో గమనించవచ్చు. అలాంటి ఉమ్మడి నామంతో సమిష్టి ప్రయోజనాల పేరిట వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోటమే ఈ బ్రాహ్మణ భావజాలానికి వెన్నెముక.

ఈ భావజాలం చేసినంత ఛిద్రం మన సమాజాన్ని మరేదీ చేయలేదు. వర్తమానంలో ఇది తీసుకుంటున్న రూపం గుర్తుపట్టటానికి వీలులేనంత లోతైనది. ఇది వ్యక్తి అంతరంగంలో తిష్టవేసుకున్న తీరు చాలా బలమైనది. వ్యక్తులుగా మన అంతరంగాలను పరిశీలించుకుని అనుక్షణం అప్రమత్తతతో మనని మనం కాపాడుకుంటే తప్ప ఈ భావజాల విషవలయం నుంచి బయటపడలేం. మనవాళ్లు బయటపడేందుకు తోడుపడలేం. సాహిత్యకారులుగా మనిషి అంతరంగం మీద ప్రభావం కనపరచగల రంగంలో పనిచేస్తున్న మనం నేను, నా రచన వంటి ప్రలోభాలను వదులుకుంటే తప్ప ఆధిక్యతా భావన తాలూకు నకారాత్మక ప్రభావానికి లోనవుతాం.

ఇదే బ్రాహ్మణ భావజాలపు మాయ. ఆ మాయలో వర్తమాన స్థితిని లోతుగా పరిశీలించటమనే అవసరాన్ని నెరవేర్చలేం. 4. హక్కుల ఉద్యమాలలాగే మన సాహిత్యమూ వామపక్ష ఉద్యమాలతోసహా అనేక రాజకీయఉద్యమా లనుంచే ప్రేరణ పొందుతోంది.ఈ ఉద్యమ రాజకీయలక్ష్యాలకు ప్రచా రంగానే మిగిలిపోరాదని బాలగోపాల్ అంటారు. ఇది సాహిత్యానికి మరింత వర్తిస్తుంది. కార్యకర్తలుగానే మిగిలిపోకుండా వ్యక్తిగత వివేచనకి పదును పెడితేనే ఆ సమాజానికీ, ఉద్యమాల దీర్ఘకాలిక లక్ష్యాలకీ సహాయపడిన వాళ్లమవుతాం. హక్కుల ఉద్యమ స్వతంత్రత గురించి బాలగోపాల్ నొక్కిచెప్పిన అంశాల నుంచి సాహిత్యకారులు గ్రహించవలసినది చాలా ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

- వివిన మూర్తి
(నేడు బాలగోపాల్ మూడవ వర్ధంతి)

Written by chs

October 15th, 2012 at 12:07 am

శ్రీలంక తమిళుల భవిష్యత్తేమిటి?

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

గడచిన ఆరు నెలలలో శ్రీలంకలో జరిగిన ఘటనలకు భారతదేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలంకకు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడ వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే రాబోయే దినాలలో ఈ స్పందన అవసరం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తప్పొప్పుకోవడమే కాదు, సవరించుకునే అవకాశమూ ఉంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:26 pm

భావజాల శృంఖలాలలో న్యాయ వ్యవస్థ

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

రెండు దశాబ్దాల కింద కేరళ రాష్ట్రం నుంచి ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. వేసినవారు ముగ్గురు విద్యార్థులు. వాళ్ల స్కూలు వాళ్లను బర్తరఫ్‌ చేసిందని వాళ్లు కోర్టు కు వెళ్లారు. ఎందుకు బర్తరఫ్‌ చేసిందంటే వాళ్లు జాతీయగీతం ఆలపించడానికి నిరాకరించారని. ఎందుకు నిరాకరించారంటే దేశభక్తి అనేది కొరవడటం వల్ల కాదు. వాళ్లు ఆచరించే క్రైస్తవ మతశాఖ దేవుడిని తప్ప మరెవరినీ స్తోత్రం చేయవద్దని చెప్తుందట. అందువల్ల ఈ పిల్లలు స్కూలులో ‘ప్రేయర్‌’ జరిగే సమయంలో అందరితో బాటు లేచి నిలబడతారు. వినయంగా తలదించుకుంటారు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:23 pm

గంగవరం పోర్టు కథ కాల్పుల దాకా ఎట్లా వచ్చిందంటే….

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

గంగవరం ఘటన కిందటి సంవత్సరంలోనే జరగవలసి ఉండిం దంటే అభ్యంతరకరంగా తోస్తుందేమో. కానీ అది నిజం. ‘గంగవరం రేవు’ నిర్మించబోయే దిబ్బపాలెం తీరం వద్ద చేప లవేటమొత్తం వారంరోజులలోగా ఆగిపోవాలని విశాఖ పట్నం ఆర్‌డివో దొరవారు గత జులై 30న తాఖీదు జారీ చేశారు. ఈ రోజు చట్టాన్ని ధిక్కరించారన్న నింద ఎదుర్కొంటున్న మత్స్య కారులు ఆరోజే ఆ పనిచేసి ఉంటే మొన్నటి యుద్ధం 9 నెలల కిందే జరిగి ఉం డేది. ఆ రోజు వారు చట్టాన్ని గౌరవించారు. హైకోర్టులో కేసు వేశారు. ఒకటి కాదు, రెండు కేసులు వేశారు. ప్రభుత్వం తనంతట తానే ఆర్‌డివో తాఖీ దును అమలుచేయబోమనీ నిర్వాసితులను సంప్రదించి వారికి పునరావాస పథకం రూపొందించిన తరువాతే దిబ్బ పాలెం తీరం వద్దనున్న మత్స్యకా రుల పడవులను తొలగిస్తామనీ హైకోర్టుకు హామీ యిచ్చింది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:21 pm

అదే పాలన, అదే విధ్వంసం

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

ఓటర్ల విజ్ఞతను ప్రశ్నించకూడదనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమైన మర్యాద. ‘ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను’ అని ఓడిపోయిన అభ్యర్థులు అంటుంటారు. శిరసావహించక వాళ్లు చేయగలిగింది లేదుగానీ, ‘నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు’ అన డం కొంచెం వికారంగా ఉండే మాటా వాస్తవమే. అయితే ఈ మర్యాదకు అంతకంటే అర్థమూ లేదు. వోటర్లుగా ప్రజలు తీసుకున్న నిర్ణయం రైతులుగానో కార్మికులుగానో విద్యార్థుల తల్లిదండ్రులుగానో మరొక అవతారంలోనో వారి శ్రేయస్సు కు నష్టకరమయితే ఆ మాట అనకుండ ఉండవలసిన అవసరం లేదు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:17 pm

సజీవంగా ఉన్న ముఠాతత్వం

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

ముఠా కక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడచిపోయిన విషయాన్ని అనవసరంగా పదే పదే తవ్వితీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నా రు. ప్రతీ హత్యనూ ఫాక్షన్‌ హత్యగా ప్రతీ కొట్లాటనూ ఫాక్షన్‌ కొట్లాటగా వర్ణించే మీడియా అజ్ఞానం కూడ దీనికి దోహదం చేసింది. ఫాక్షన్లు ఇప్పటికీ ఉన్నాయా అంటే మనం దానికి ఇచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:13 pm

ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?

without comments

-కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)
ఒక వారం దినాలుగా వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ‘మహాకూటమి’ గెలిస్తే రాయలసీమకూ కోస్తాంధ్రకూ నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిలిచిపోతాయనీ ఆ ప్రాంతాలవారు హైదరాబాద్‌లో మనుగడ సాగించలేరనీ ఇప్పటికే వారినక్కడ పరాయివారిగా ఎంచి దాడులు చేస్తున్నారనీ రెండవ విడత ఎన్నికలు జరగవలసి ఉన్న ప్రాంతాలలో ఉపన్యసిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం చాలా న్యాయంగానే వ్యతిరేకతకూ విమర్శకూ దారి తీసింది.ద్వేషం రెచ్చగొట్టడంలోని అనౌచిత్యాన్ని అటుంచి ఈ వ్యాఖ్యలు అబద్ధాలు కూడ. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతాలలో సహితం బయటివారు క్షేమంగా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. 1969 మాటేమోగానీ ప్రస్తుత తెలంగాణ ఉద్యమమంతటి సౌమ్యమయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని దేశం ఇప్పటిదాకా చూసి ఉండదు. ఆ సౌమ్యత వల్లనే నష్టపోయామన్న భావన తెలంగాణ వాదులను ఒక పక్క బాధపెడుతుండగా అది లేదని అనడం పుండుమీద కారం జల్లడమే. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:10 pm

అభివృద్ధి పిడికిలిలో చిన్నజనం

with 2 comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

సెజ్‌ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:07 pm

కరువుకూ, పోలవరానికీ సంబంధం ఏమిటో…!

without comments

- కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

‘వివిధ కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న’ వారిలో మేము కూడ ఉన్నాము కాబట్టి, వేములపల్లి వెంకట్రామయ్య రాసిన వ్యాసాని(జన వరి 6,ఆంధ్రజ్యోతి)కి జవాబు రాయడం అవసరమని భావిస్తున్నాను. గోదా వరి జలాలలో మన రాష్ట్రానికి కేటాయించిన వాటాలో 700 టిఎంసిలు (680 అని నిపుణులఅంచనా) ఇంకా వినియోగంలోకి రాకుండా మిగిలే ఉందని ఆయన గుర్తించా రు. మన వాటాను వీలయిన మేరకు వాడుకోవటం అవసరమనే అనుకుందాం. దాని నుంచి పోలవరం ప్రాజెక్టు చేపట్టడం తప్పనిసరి అనే నిర్ధారణకు ఎందుకు రావాలి? ఆ నీళ్ళన్నీ పోలవరం దగ్గరనో, దానికి కొంచెం ఎగువనో గోదావరిలో వచ్చి చేరేటట్టయితే పోలవరం ప్రాజెక్టు ద్వారా తప్ప ఇంకొకరకంగా మన వాటాను వాడుకోవటం సాధ్యం కాదు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:04 pm

ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పుడు?

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy).

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందుకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యా యం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తులమ య్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. ‘క్లాసికల్‌’ అనే పదాన్ని ప్రాచీనం అనే అర్థంలో తీసుకునేట్టయితే తమి ళం ప్రాచీనతను రుజువు చేయడానికి కుండ పెంకులూ, శిలా ఫలకాలూ వెతకనక్కర లేదు. తమిళుల సంస్క­ృతిలో ఇప్పటి కీ సజీవంగా ఉన్న రెండు వేల ఏళ్లనాటి సాహిత్యం ఉంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 8:59 pm

ఐక్యతే హక్కులకు రక్షణ

without comments

యస్‌.శేషయ్య (APCLC)  Source: Andhra Jyothy, November 11, 2009.

అభివృద్ధిపేరుతో జరుగుతున్న విస్తాపన, విధ్వంసం, హిందూ మతోన్మాదం పెరిగి మైనారిటి మతస్తులపై ఊచకోత, ఉగ్రవాదం పేరుతో హక్కుల ఉల్లంఘన, తీవ్రవాదం పెనుప్రమాదం అని చెప్తూ ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో ఆదీవాసీలపై చేస్తున్న యుద్ధం, అన్నీ కూడా హక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదు. హక్కుల సంఘాలు కలిసి ఐక్యంగానే హక్కులను కాపాడుకోగలుగుతాం. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగతాం.

బాలగోపాల్‌ ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమకారులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. బాలగోపాల్‌ ‘ఇక లేడు’ అనే నిస్పృహతోపాటు, ‘పౌరసమాజం’ ఒక రకమైన భయానికి, వెలితికి లోనయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ, ఈ పరిస్థితి తాత్కాలికమే. పురుషోత్తం, ఆజం అలీలను సర్కారీ హంతకముఠాలు కిరాతకంగా హత్య చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. పౌరహక్కుల సంఘం ఇక పనిచేస్తుందా? అనే సంశయం, సందేహాలు ఏర్పడ్డాయి. బాలగోపాల్‌ ఆ సందర్భంలో ‘నిస్పృహను, నిస్సహాయతను అధిగమించడానికి కావల్సిన దృఢ సంకల్పం, మానసిక స్థైర్యాన్ని పురుషోత్తం నుండి ఉద్యమాలు, ఉద్యమకారులు, ప్రజలు నేర్చుకోగలిగితే అతని మరణం వృధా కానట్టే’ అని ధైర్యాన్ని యిచ్చాడు. Read the rest of this entry »

Written by chs

November 13th, 2009 at 8:45 am

నిక్కచ్చిగా అంచనా వేద్దాం

without comments

దుడ్డు ప్రభాకర్‌
(వ్యాసకర్త కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు)

Source: Andhra Jyothy,  30th October, 2009).

దళిత, ఆదివాసీ, మహిళా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు జరుగుతున్నా యి. అవి ఏవీ జరగనట్టు హక్కుల ఉద్యమానికి ఆది-అంతం బాలగోపాలే అని వ్యాఖ్యానించడం ఆయన మనస్తత్వానికి పూర్తి వ్యతిరేకం. ఈ వింత పోకడ ఇప్పటి వరకూ పార్లమెంటరీ పార్టీల నాయకులు మరణించిన సందర్భాలలో కనిపిస్తూ ఉండేది. ఇంత వరకు ఏ ఉద్యమ కారుడు మరణించిన సందర్భంలో కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు వినలేదు. Read the rest of this entry »

Written by chs

November 12th, 2009 at 9:49 pm

పావన చరితుడు కె.బాలగోపాల్‌..

without comments

సి.ధర్మారావు ( Source: Andhra Jyothy, 30th October, 2009).

పావన చరితుల్ని గూర్చి ఎందరు ఎన్ని సంగతులు చెప్పినా, మళ్లీ మళ్లీ వినబుద్ధి అవుతుంది గదా. కె.బాలగోపాల్‌ గురించి అసంఖ్యాకంగా వస్తున్న రాతలు, కవితలు చూశాక నాకు సంబంధించిన ఒక చిన్న ఘటన కూడా నలుగురితో పంచుకోవాలనిపించింది. అది 1999 సంవత్సరం అని గుర్తు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం మా ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్లి తలుపు తీసి చూస్తే, ఎవరో పరిచయం లేని పెద్దమనిషి. ‘నేను కె. బాలగోపాల్‌ని’ అన్నారు. నేను సంభ్రమంగా-మీరు మా ఇంటికి రావటం అదృష్టం అని, లోపలికి ఆహ్వానించాను. కూచోబెట్టి మంచినీళ్లు తెచ్చిస్తే తాగారు.

నాకు అంతకు ముందు ఆయన్ని గుర్తుపట్టే పాటి పరిచయం లేకపోయినా, ఆయన ఎవరో, ఏమిటో నాకు చాలా వరకు తెలుసు. ‘ఇంట్లో ఎవరూ లేరు, అయినా నాకు టీ పెట్టడం వచ్చు, తీసుకుందురు గాని’ అన్నాను. ఈ లాంఛనం అసలు పట్టించుకోకుండానే-’నేను ఒక నోటిఫికేషను గురించి వచ్చాను. విశాఖ కోర్టులో గిరిజనుల కేసొకటి వాదిస్తున్నాను. ఆ రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్లెప్పు డూ వాళ్లకు జాబులు, నోటీసులు ఇంగ్లీషులో పంపిస్తుంటారు. వాటిల్లో ఏముందో వాళ్లకు చెప్పేవారు లేరు. అలాంటివన్నీ తెలుగులోనే పంపాలని ప్రభుత్వ ఉత్తర్వులుంటే, నాకు కొంత ఉపయోగం ఉంటుంది’ అన్నారు.

Read the rest of this entry »

Written by chs

November 12th, 2009 at 9:40 pm

నాకు ఎదురుచూపులే మిగిలాయి…

with one comment

గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్‌ (Source: Andhra Jyothy, November 1st, 2009).

ఈ మధ్యనే (08.10.2009) హఠాన్మరణం చెందిన మానవహక్కుల నేత కె.బాలగోపాల్‌తో పాటు హైస్కూల్లోనూ, ఆ తర్వాత డిగ్రీలోనూ దాదాపు ఐదారేళ్లు కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్‌. ప్రస్తుతం ఈయన కడప జిల్లా గ్రామీణబ్యాంకులో సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగ బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో బాలగోపాల్‌ జీవనశైలిని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అందిస్తున్న అక్షర నివాళి ఇది.

బాలగోపాల్‌తో ఐదారేళ్లు కలిసి నడిచిన అదృష్టవంతుణ్ణి నేను. తిరుపతిలోని ప్రకాశంపంతులు మున్సిపల్‌ హైస్కూలులో 8,9,10 తరగతులు కలిసి చదువుకొనే రోజుల్లో అతనితో సన్నిహితంగా ఉంటూ, ఇతర స్నేహితుల మధ్య నా స్థానం ప్రత్యేకమైనదిగా భావించేవాణ్ణి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవడిగా బాలగోపాల్‌, గౌరిపెద్ది రామసుబ్బశర్మ కుమారుడిగా నేను …అందరికీ తెలిసిన రెండు పండిత కుటుంబాల సాన్నిహిత్యం మాది. Read the rest of this entry »

Written by chs

November 7th, 2009 at 8:47 pm

ఈ కాలపు గాంధీ

without comments

- వెల్చాల కొండలరావు
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు, Source: Andhra Jyothy, October 27, 2009).

అరుదైన మనీషి, చాలా అరుదైన మేధావి బాలగోపాల్‌. అటువంటి వ్యక్తి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందని వారు, దుఃఖితులు కాని వారు ఎవరైనా ఉంటారా? మానవహక్కులకు పర్యాయపదం బాలగోపాల్‌. అన్ని హక్కులు మానవహక్కులలోనే సమ్మిళితమై ఉన్నాయని గ్రహించి వాటిని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమాలు విజయవంతం కావాలంటే, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలంటే ప్రజలకు వారి హక్కుల గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి. ‘ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలిస్తే వారే వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తారని’ బాలగోపాల్‌ విశ్వసించారు. Read the rest of this entry »

Written by chs

October 28th, 2009 at 4:08 pm