Archive for the ‘Balagopal Telugu Articles’ Category
Kadapa Jillalo-Palegalla Rajyam
Kadapa-Palegalla Rajyam ( K. Balagopal, APCLC, Kadapa District Publication, 1996).
Prachina Bharat Desa Charitra – Kosambi Parichayam
Prachina Bharata Charitra (K. Balagopal, September 1986) – Kosambi Parichayam
( Introduction to D. Kosambi books on Indian Ancient History)
Kallola Loya, Report on HR Voilations in Kashmir
Chikati Konalu – Essay on Three Decades of Naxalbari
Chikati Konalu , K BalagopalCritical essay on 30 years of Naxalite movement in Andhra Pradesh.
( MuDDu Dashabdla Naxalbari, Gamyam Gamanam (1967 – 1997) ,
Editors: S. Sudhakar and M. Kodandram Reddy, Perspective Publishers, August 1998).
Kalola Katha Chitralu, Chivari Maata
(Source: Kalola Katha Chitralu -Balagopal Essays, Perspective Publishers, 1997).
http://balagopal.org/wp-content/uploads/2010/02/ChivariMata.pdf
Charitra, Manishi, Marxism
(Source: Aruna Taara, September 1993).
Charitrika Drukpadham
Source: Samiksha, May 1987.
http://balagopal.org/wp-content/uploads/2010/02/CharitrakaDrukpadham.pdf
శ్రీలంక తమిళుల భవిష్యత్తేమిటి?
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
గడచిన ఆరు నెలలలో శ్రీలంకలో జరిగిన ఘటనలకు భారతదేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలంకకు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడ వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే రాబోయే దినాలలో ఈ స్పందన అవసరం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తప్పొప్పుకోవడమే కాదు, సవరించుకునే అవకాశమూ ఉంది. Read the rest of this entry »
భావజాల శృంఖలాలలో న్యాయ వ్యవస్థ
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
రెండు దశాబ్దాల కింద కేరళ రాష్ట్రం నుంచి ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. వేసినవారు ముగ్గురు విద్యార్థులు. వాళ్ల స్కూలు వాళ్లను బర్తరఫ్ చేసిందని వాళ్లు కోర్టు కు వెళ్లారు. ఎందుకు బర్తరఫ్ చేసిందంటే వాళ్లు జాతీయగీతం ఆలపించడానికి నిరాకరించారని. ఎందుకు నిరాకరించారంటే దేశభక్తి అనేది కొరవడటం వల్ల కాదు. వాళ్లు ఆచరించే క్రైస్తవ మతశాఖ దేవుడిని తప్ప మరెవరినీ స్తోత్రం చేయవద్దని చెప్తుందట. అందువల్ల ఈ పిల్లలు స్కూలులో ‘ప్రేయర్’ జరిగే సమయంలో అందరితో బాటు లేచి నిలబడతారు. వినయంగా తలదించుకుంటారు. Read the rest of this entry »
గంగవరం పోర్టు కథ కాల్పుల దాకా ఎట్లా వచ్చిందంటే….
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
గంగవరం ఘటన కిందటి సంవత్సరంలోనే జరగవలసి ఉండిం దంటే అభ్యంతరకరంగా తోస్తుందేమో. కానీ అది నిజం. ‘గంగవరం రేవు’ నిర్మించబోయే దిబ్బపాలెం తీరం వద్ద చేప లవేటమొత్తం వారంరోజులలోగా ఆగిపోవాలని విశాఖ పట్నం ఆర్డివో దొరవారు గత జులై 30న తాఖీదు జారీ చేశారు. ఈ రోజు చట్టాన్ని ధిక్కరించారన్న నింద ఎదుర్కొంటున్న మత్స్య కారులు ఆరోజే ఆ పనిచేసి ఉంటే మొన్నటి యుద్ధం 9 నెలల కిందే జరిగి ఉం డేది. ఆ రోజు వారు చట్టాన్ని గౌరవించారు. హైకోర్టులో కేసు వేశారు. ఒకటి కాదు, రెండు కేసులు వేశారు. ప్రభుత్వం తనంతట తానే ఆర్డివో తాఖీ దును అమలుచేయబోమనీ నిర్వాసితులను సంప్రదించి వారికి పునరావాస పథకం రూపొందించిన తరువాతే దిబ్బ పాలెం తీరం వద్దనున్న మత్స్యకా రుల పడవులను తొలగిస్తామనీ హైకోర్టుకు హామీ యిచ్చింది. Read the rest of this entry »
అదే పాలన, అదే విధ్వంసం
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
ఓటర్ల విజ్ఞతను ప్రశ్నించకూడదనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమైన మర్యాద. ‘ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను’ అని ఓడిపోయిన అభ్యర్థులు అంటుంటారు. శిరసావహించక వాళ్లు చేయగలిగింది లేదుగానీ, ‘నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు’ అన డం కొంచెం వికారంగా ఉండే మాటా వాస్తవమే. అయితే ఈ మర్యాదకు అంతకంటే అర్థమూ లేదు. వోటర్లుగా ప్రజలు తీసుకున్న నిర్ణయం రైతులుగానో కార్మికులుగానో విద్యార్థుల తల్లిదండ్రులుగానో మరొక అవతారంలోనో వారి శ్రేయస్సు కు నష్టకరమయితే ఆ మాట అనకుండ ఉండవలసిన అవసరం లేదు. Read the rest of this entry »
సజీవంగా ఉన్న ముఠాతత్వం
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
ముఠా కక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడచిపోయిన విషయాన్ని అనవసరంగా పదే పదే తవ్వితీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నా రు. ప్రతీ హత్యనూ ఫాక్షన్ హత్యగా ప్రతీ కొట్లాటనూ ఫాక్షన్ కొట్లాటగా వర్ణించే మీడియా అజ్ఞానం కూడ దీనికి దోహదం చేసింది. ఫాక్షన్లు ఇప్పటికీ ఉన్నాయా అంటే మనం దానికి ఇచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. Read the rest of this entry »
ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?
| -కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy) ఒక వారం దినాలుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి ‘మహాకూటమి’ గెలిస్తే రాయలసీమకూ కోస్తాంధ్రకూ నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిలిచిపోతాయనీ ఆ ప్రాంతాలవారు హైదరాబాద్లో మనుగడ సాగించలేరనీ ఇప్పటికే వారినక్కడ పరాయివారిగా ఎంచి దాడులు చేస్తున్నారనీ రెండవ విడత ఎన్నికలు జరగవలసి ఉన్న ప్రాంతాలలో ఉపన్యసిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం చాలా న్యాయంగానే వ్యతిరేకతకూ విమర్శకూ దారి తీసింది.ద్వేషం రెచ్చగొట్టడంలోని అనౌచిత్యాన్ని అటుంచి ఈ వ్యాఖ్యలు అబద్ధాలు కూడ. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతాలలో సహితం బయటివారు క్షేమంగా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. 1969 మాటేమోగానీ ప్రస్తుత తెలంగాణ ఉద్యమమంతటి సౌమ్యమయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని దేశం ఇప్పటిదాకా చూసి ఉండదు. ఆ సౌమ్యత వల్లనే నష్టపోయామన్న భావన తెలంగాణ వాదులను ఒక పక్క బాధపెడుతుండగా అది లేదని అనడం పుండుమీద కారం జల్లడమే. Read the rest of this entry » |
అభివృద్ధి పిడికిలిలో చిన్నజనం
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
సెజ్ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. Read the rest of this entry »
కరువుకూ, పోలవరానికీ సంబంధం ఏమిటో…!
- కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
‘వివిధ కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న’ వారిలో మేము కూడ ఉన్నాము కాబట్టి, వేములపల్లి వెంకట్రామయ్య రాసిన వ్యాసాని(జన వరి 6,ఆంధ్రజ్యోతి)కి జవాబు రాయడం అవసరమని భావిస్తున్నాను. గోదా వరి జలాలలో మన రాష్ట్రానికి కేటాయించిన వాటాలో 700 టిఎంసిలు (680 అని నిపుణులఅంచనా) ఇంకా వినియోగంలోకి రాకుండా మిగిలే ఉందని ఆయన గుర్తించా రు. మన వాటాను వీలయిన మేరకు వాడుకోవటం అవసరమనే అనుకుందాం. దాని నుంచి పోలవరం ప్రాజెక్టు చేపట్టడం తప్పనిసరి అనే నిర్ధారణకు ఎందుకు రావాలి? ఆ నీళ్ళన్నీ పోలవరం దగ్గరనో, దానికి కొంచెం ఎగువనో గోదావరిలో వచ్చి చేరేటట్టయితే పోలవరం ప్రాజెక్టు ద్వారా తప్ప ఇంకొకరకంగా మన వాటాను వాడుకోవటం సాధ్యం కాదు. Read the rest of this entry »